నేడు డివిజన్ల వారీగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
భద్రాద్రి జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.