షేక్పేట్లో బీఆర్ఎస్ కార్యకర్తల బూత్స్థాయి సమావేశం

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లో గురువారం సాయంత్రం BRS బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఛైర్మన్ విద్యా సాగర్ రావు, పార్టీ నాయకులు సోహెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.