'నేడు యథావిధిగా పీజీఆర్ఎస్'

'నేడు యథావిధిగా పీజీఆర్ఎస్'

W.G: భీమవరం కలెక్టరేట్‌లో, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా మీకోసం వెబ్‌సైట్‌లో సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.