చింతపల్లిలో పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం
ASR: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏడీఏ తిరుమలరావు రైతులకు సూచించారు. బుధవారం చింతపల్లి-2 రైతు సేవా కేంద్రంలో ఏవో రైతులతో కలిసి పీఎం కిసాన్, ఏడీఎస్బీ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 7వేలు రైతులకు అందుతుందని తెలిపారు.