'వరి పంటను జాగ్రత్తగా భద్ర పరచాలి'
CTR: దిత్వా తుఫాన్ కారణంగా వరి పంటను జాగ్రత్తగా కాపాడాలని ఏడి శివకుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వర్షపు నీటిని పొలంలో నుంచి తీసివేయాలన్నారు. వరి వెహోలకెత్తకుండ కాపాడేందుకు ఉప్పుద్రావణాన్ని ఒక లీటరు నీటిలో 50 గ్రాముల సాధారణ ఉప్పును కలిపి, వరిదాన్యం మెలకెత్తకుండ చల్లాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.