VIDEO: రేపు అమ్రాబాద్కు వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ రాక..!
NGKL: రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి గురువారం అమ్రాబాద్లో పర్యటించనున్నారు. స్థానిక ఎంకే గార్డెన్లో నిర్వహించే 'భూ సమస్యల సదస్సు'లో పాల్గొని రైతుల సమస్యలు, భూ భారతి చట్టం పై చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్, పలు శాఖల అధికారులు పాల్గొంటారని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ తెలిపారు.