డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ
ATP: రాయదుర్గం పట్టణంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులు కళాశాల నుంచి వినాయక కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో ' అంటూ నినాదాలు చేపట్టారు.