అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళం
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం వెంకట లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం వారు 60 వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.