జగన్ను కలిసిన గువ్వల శ్రీకాంత్ రెడ్డి
ATP: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని శింగనమల నియోజకవర్గ సీనియర్ నేత, మాజీ జడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గువ్వల శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై అధినేతతో చర్చించారు.