ఛత్తీస్గఢ్లో పర్యటించనున్న మోదీ
ప్రధాని మోదీ ఈరోజు ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగే రజత్ మహోత్సవాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో రూ.14,260 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవాలు చేస్తారు. విధానసభ కొత్త భవనం, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం, బ్రహ్మ కుమారీల 'శాంతి శిఖర్'ను కూడా ప్రారంభిస్తారు.