ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
BPT: బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని (P-4) కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.