శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయ హుండీ ఆదాయం వివరాలు
నెల్లూరులోని మూలాపేటలో ఉన్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ ఆదాయం లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజు పర్యవేక్షణలో అక్టోబర్ 6 నుంచి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఇందులో భాగంగా రూ. 9,85,617 నగదు, 11 మలేషియా కరెన్సీ, 38 గ్రాముల బంగారం, 29 గ్రాముల వెండి లభించినట్లు ఆయన పేర్కొన్నారు.