ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలి: కలెక్టర్
కర్నూలు జిల్లాలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ఏపీఎమ్ఐపీ,డీఆర్డీఏ, బ్యాంక్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు యూనిట్ల మంజూరులో జాప్యం ఉండకూడదన్నారు.