'రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే తక్షణ కర్తవ్యం'
SKLM: భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కాషాయీకరణ నుంచి కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని కుల నిర్మూలనా పోరాట సమితి జిల్లా సహాయక కార్యదర్శి రాంబాబు అన్నారు. సోమవారం ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో ఈ అంశంపై ఈ నెల 16న జిల్లా అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జరగనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సదస్సులో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.