ALERT: మూడు రోజులు జాగ్రత్త
TG: రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని చెప్పింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.