కొచ్చి తీరంలో హై అలర్ట్

కొచ్చి తీరంలో హై అలర్ట్

కేరళ కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళకు 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురై సంద్రంలో మునిగింది. ఆ నౌకలో ఉన్న కంటైనర్లలో ప్రమాదకర రనాయనాలతో పాటు డీజిల్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమవుతాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కంటైనర్లలోని రసాయనాలు, ఇంధనాలు తీరం వైపు వస్తే వాటిని తాకొద్దని సూచించారు.