'పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందేలా అధికారులు పని చేయాలి'
NLG: ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో పాఠశాల విద్యార్థుల స్కాలర్ షిప్ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్ష్షిప్ల దరఖాస్తులు 30 శాతం దాటాలన్నారు.