తుఫాన్ బీభత్సం.. 66 మంది మృతి
ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదలకు 66 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇళ్లు, కార్లు నీటమునిగాయి. అగుసాన్ డెల్సర్ ప్రావిన్స్లో సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లోని ఐదుగురి ఆచూకీ గల్లంతయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.