అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నాం: మంత్రి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నాం: మంత్రి

MLG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ పేదవారి కలలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని SLN గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.