విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

విషాదం.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఉగ్గుముడిలో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను వరలక్ష్మి(24), వర్షిత్(4), ప్రశాంత్(2)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వివాహిత ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.