ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

GDWL: గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. HIV లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిని సందర్శించి చికిత్స చేయించుకోవాలన్నారు.