విజయవాడ ఆలయంలో ఇంటి దొంగలు

విజయవాడ ఆలయంలో ఇంటి దొంగలు

AP: విజయవాడ నగర శివారు యనమలకుదురు శివాలయంలో అధికారులే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. అర్చకుడు సాగర్ ఆలయానికి మారు తాళాలు చేయించి ఎవరూ లేనప్పుడు హుండీ  కానుకలను మాయం చేసేవాడని తేలింది. ఆలయ మంటపంలోని 16 CC కెమెరాలను ఆఫ్ చేసేవాడని, గత రెండేళ్లలో దాదాపు రూ.10 లక్షల విలువైన కానుకలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. దీనికి ఆలయ ఈఓ భవాని సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.