VIDEO: గిరిజన మ్యూజియం ఆదాయం వివరాలు
ASR: అరకులోయ గిరిజన మ్యూజియంను శని, ఆదివారాలలో 5261 మంది సందర్శించినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. ఈ రెండు రోజుల సందర్శకులు పర్యటనతో మ్యూజియంకు రూ.3.53 లక్షల ఆదాయం వచ్చినట్లు మ్యూజియం ఇంఛార్జ్ మణికుమార్ వెల్లడించారు. మ్యూజియంలోని స్ధానిక ఆదివాసీ గిరిజిన ఆచార వ్యవహారాల కళాకృత్యాలు, అడ్వంఛర్ ఏక్టివిటీలు, దింసా నృత్య ప్రదర్శన పర్యాటకులను ఆకట్టుకున్నాయి.