'వర్కర్లకు పాతపద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి'

KMM: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయడంతో పాటు జీఓ 64 అమలును నిలిపివేసి పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు భూక్య శివనాయక్ డిమాండ్ చేశారు. కారేపల్లి మండల పరిధిలో గల శాంతినగర్ ఆశ్రమ పాఠశాల ముందు శనివారం దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.