మంత్రి తుమ్మలను కలిసిన పద్మశాలీలు
WGL: తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వరంగల్ జిల్లాకు చెందిన పద్మశాలీలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఆదివారం ఉదయం వారు MLC బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.