నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
కర్నూలు నగరంలో ఈరోజు ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కొత్త బస్టాండ్ ప్రాంతం, కల్లూరు ఈద్గా, మహావీర్నగర్ తదితర ప్రాంతాల్లో సరఫరాలో ఉండదని వెల్లడించారు. విద్యుత్ వినియోగ దారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.