జగ్గుచక్రతండాలో ముందస్తు బడిబాట కార్యక్రమం

జగ్గుచక్రతండాలో ముందస్తు బడిబాట కార్యక్రమం

NLG: దేవరకొండ మండలం జగ్గుచక్రతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవాస ప్రాంతంలో గురువారం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు పానుగంటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఉపాధ్యాయలు జానపాటి ఎల్లయ్య సర్పంచ్ జర్పుల జూలి బాలునాయక్, తదితరులున్నారు.