రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. నూకలమర్రి గ్రామం చెందిన మేడుదుల దేవయ్య కొదురుపాకలో ఆటో ఎక్కి జగ్గారావుపల్లికి వెళ్తుండగా, నాంపల్లి గ్రామం చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి బైక్తో ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడటంతో దేవయ్య మృతి చెందాడు.