ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
WNP: ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదన్నారు.