14న మెగా రక్తదాన శిబిరం..!

14న మెగా రక్తదాన శిబిరం..!

KMR: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ తెలిపారు. శిబిరంలో పాల్గొనే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్‌లు అందజేస్తారని పేర్కొన్నారు.