రోడ్డు భద్రతపై కలెక్టర్ సమీక్ష
ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ రాజర్షిషా రోడ్డు భద్రతపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు శాఖల మధ్య సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు.