ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: మంత్రి

ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: మంత్రి

సత్యసాయి: పెనుకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని అన్నారు.