అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
JGL: జగిత్యాల పట్టణంలోని 34, 35, 44 వార్డులలో రూ. 26 లక్షల వ్యయంతో టవర్ నుంచి గీతాభవన్ రోడ్డు వరకు చేపట్టనున్న బిటి రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కమిషనర్ స్పందన, డిఈ సతీష్, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.