రేపు అశ్వాపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
BDK: అశ్వాపురం మండలంలో రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 10:30 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.