విజయవాడ ఎంపీని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఆయనను ఎంపీ చిన్ని శాలువాతో సత్కరించారు.