రాజేంద్రనగర్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్
RR: రాజేంద్రనగర్లో డ్రగ్స్ ముఠాను ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరు నైజీరియా నుంచి 'డెడ్ డ్రాప్' పద్ధతిలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. అరెస్టయిన వారిలో సంతోష్, గాంధీ సందీప్, కండేపల్లి శివ, పలక సాయిబాబు ఉన్నారు.