చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

GNTR: గుంటూరు స్వర్ణభారతీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ సురేశ్ను గురువారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు బానిసై, డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. విజయవాడలో 130 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి దొంగిలించినట్లు చెప్పారు. సురేశ్పై ఇప్పటికే 30 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.