రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష

SKLM: టెక్కలి, పలాస డివిజన్ల రెవెన్యూ అధికారులతో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వపనిల్ దినకర్ సమీక్ష నిర్వహించారు. టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, వీఆర్వో లతో వివిధ అంశాలపై సమీక్షించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.