'విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలి'
KKD: జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డా. దేవరపల్లి చెన్నారావు నేతృత్వంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మాధురి మాట్లాడుతూ.. భావితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పౌరుడు విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు.