పాత కక్షలతో యువకులపై కత్తి దాడి: నిందితుడి అరెస్ట్
SRPT: హుజూర్నగర్లో ఈ నెల మూడవ తేదీన భూ వివాదం మనసులో పెట్టుకుని ఇద్దరు యువకులపై కత్తితో దాడి చేసిన నిందితుడు జనిగ వినయ్ను గువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవ పడుతున్న వినయ్ను ప్రశ్నించినందుకు గోసుల వినోద్, నవీన్లను కత్తితో పొడిచాడు. కేసు నమోదు చేసిన ఎస్సై మోహన్ బాబు, నిందితుడిని రిమాండ్ నిమిత్తం నల్గొండ జైలుకు తరలించారు.