ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటా రూ.14,400, నాన్ ఏసీ మిర్చి క్వింటా రూ.8,500, అటు క్వింటా పత్తి ధర రూ.7,850 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం రూ.100 తగ్గగా.. ఏసీ మిర్చి, అటు పత్తి ధర స్థిరంగా కొనసాగుతుంది.