సివిల్స్ పరీక్షలో హన్మాజీ పేట వాసికి 748 వ ర్యాంకు

సివిల్స్ పరీక్షలో హన్మాజీ పేట వాసికి 748 వ ర్యాంకు

జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాహుల్ విజయంతో హన్మాజీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుని పేరెంట్స్‌కు అభినందనలు తెలిపారు.