'రేపు పిఠాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం'

KKD: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం రేపు (సోమవారం) పిఠాపురం పాడా కార్యాలయంలో జరుగుతున్నట్లు పాడా పీడీ పి. వేణుగోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన డివిజనల్, మండల స్థాయి అధికారులందరూ పాల్గొంటారని, ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే అర్జీలు అందించి పరిష్కారం పొందవచ్చునని తెలిపారు.