విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,08,427 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 78 మంది స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. 23 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించగా.. 2430 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.