రైల్వే పరీక్షలకు ఉచిత శిక్షణ

రైల్వే పరీక్షలకు ఉచిత శిక్షణ

కాకినాడ: రైల్వే గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు తెలిపారు. రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్లో 100 మందికి శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులు రాజమండ్రి, కాకినాడ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు.