'అర్హులైన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి'

SRPT: అర్హులైన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు యాదగిరిరావు డిమాండ్ చేశారు. ఇవాళ తుంగతుర్తి మండలం వెంపటిలో ప్రజా సమస్యలపై సీపీఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.