దోమలపై మహా యుద్ధం: కలెక్టర్

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఐదు లక్షల గాంబూసియా చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం అరసవల్లి దేవస్థానం ఇంద్రపుష్కరినిలో 750 చేప పిల్లలను వదిలారు. వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు.