వాహనమిత్ర పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

ATP: ఆటోడ్రైవర్లకు ఆర్థికసహాయం అందించేందుకు ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.15,000 చొప్పున అందజేయనున్నారు. జిల్లాలో 20,000 మందికిపైగా ఆటోడ్రైవర్లు ఉండగా, అర్హులు రేపటి నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అక్టోబరు 1న నగదు జమ చేయనున్నారు.