సెన్సస్ పనిలో ఖచ్చితత్వం తప్పనిసరి: జేసీ
PPM: కురుపాం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సెన్సస్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ యస్వంత్ కుమార్ రెడ్డి సందర్శించారు. శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడి, సెన్సస్ ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, శిక్షణ విధానం, అమలుపై వివరాలు తెలుసుకున్నారు.