యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

BNR: లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో పోటెత్తారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కిందగల కల్యాణకట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, వీధులు భక్తులతో సందడిగా మారాయి.